ముగిసిన సైకాలజిస్టుల శిక్షణ | psychologiests training is ended | Sakshi
Sakshi News home page

ముగిసిన సైకాలజిస్టుల శిక్షణ

Aug 15 2016 12:04 AM | Updated on Sep 4 2017 9:17 AM

కేవీఆర్‌ మహిళా కళాశాలలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న రాయలసీమ స్థాయి సైకాలజిస్టుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది.

కర్నూలు(హాస్పిటల్‌):  కేవీఆర్‌ మహిళా కళాశాలలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న రాయలసీమ స్థాయి సైకాలజిస్టుల శిక్షణ  కార్యక్రమం ఆదివారం ముగిసింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ చెన్నంశెట్టి వెంకటసుబ్బయ్య సైకాలజి కౌన్సెలింగ్, మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, కౌన్సెలింగ్‌  ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమానికి 50 మందికి పైగా సైకాలజిస్టులు హాజరై శిక్షణ పొందినట్లు ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దిగారి లక్ష్మన్న తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేశ్వరి, సైకాలజీ హెచ్‌ఓడీ వివి శేషారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement