- రసాభాసగా కౌన్సిల్ సమావేశం
- మున్సిపల్ స్థలాల ఆక్రమణపై దుమారం
- అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
- వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైకాట్
హిందూపురం అర్బన్ : మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారుల మ«ధ్య వాదనలు దుమారం రేపాయి. అధికారులను టార్గెట్ చేసి ఒత్తిడి చేస్తే సెలవులపై వెళ్లిపోతామని వాకౌట్ చేశారు. అధికారులు లేని కౌన్సిల్లో ప్రజాసమస్యల పరిష్కారమేదంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైకాట్తో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం దద్దరిల్లిపోయింది.
కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏడాది చివరిరోజు శనివారం చైర్పర్సన్ ఆర్.లక్ష్మి అధ్యక్షతన కమిషనర్ పి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నాగభూషణం, ఆసీఫ్వుల్లా మాట్లాడుతూ పట్టణంలో చెత్త గురించి ప్రస్తావించారు. పని చేయకుండానే జీతాలు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. కౌన్సిలర్ షాజియా మాట్లాడుతూ పరిగి రోడ్డులోని మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా ఎందుకు స్పందించలేదన్నారు.
ఇంతలో టీడీపీ కౌన్సిలర్ రోషన్అలీ మాట్లాడుతూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎస్బీఐ వద్ద ఉన్న పే అండ్ యూజ్ లెట్రిన్లను మూడంతస్తులుగా నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కమిషనర్ స్పందించి నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగాయి.. నోటీసులు కాకుండా నిర్మాణాలు కూల్చివేయాలని సూచించారు.
అధికారులు, టీడీపీ కౌన్సిలర్ల వాగ్వాదం
సిబ్బంది తక్కువగా ఉన్నా.. తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్నా.. తమపై పెత్తనం చేస్తే సహించేది లేదని మెప్మా టీపీఓ విజయభాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే రీతిలో మెప్మా విభాగంలో అవినీతిమయమని ఎలా చెబుతావంటూ సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్పై కూడా వాదనకు దిగారు. అధికారులను టార్గెట్ చేస్తే సెలవులపై వెళ్లిపోతామంటూ వాకౌట్ చేశారు.
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బైకాట్
అవసరమైనప్పుడు అధికారులను మీరే వెనకేసుకొస్తారు. రెండేళ్లుగా ఆక్రమణలపై చర్యలు తీసుకోండంటూ నిలదీసినా ఉలుకూ పలుకూ లేదు. ఉన్నట్టుండి అధికారులను టార్గెట్ చేస్తూ 15 రోజుల్లో అన్నింటిపై చర్యలు తీసుకోవాలంటున్నారని వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీ‹ఫ్వుల్లా, రెహెమన్ విమర్శించారు. అధికారులు లేని సమావేశంలో ప్రజాసమస్యలను ఎవరితో చర్చించాలంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు బైకాట్ చేశారు.
నోటీసులు కాదు.. అక్రమ నిర్మాణాలు కూల్చండి
Published Sat, Dec 31 2016 11:07 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement