వేడి గాలులను అడ్డుకుంటున్న ఆగ్నేయ, దక్షిణ చల్లని గాలులు
సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల నుంచి అదేపనిగా ఉడికిస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వడగాడ్పుల నుంచి కాస్త ఊరట చెందనున్నారు. కొన్ని రోజులుగా పశ్చిమ, ఉత్తర దిశల నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా పగటి(గరిష్ట) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా సముద్రం పైనుంచి వీస్తున్న ఆగ్నేయ, దక్షిణ(చల్లని) గాలులు.. ఉత్తర, పశ్చిమ గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం వారం రోజుల నుంచి కొనసాగిస్తున్న వడగాడ్పుల హెచ్చరికలను గురువారం రెండు రాష్ట్రాల్లోనూ ఉపసంహరించింది. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది కూడా కోస్తాలో ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించడానికి దోహదపడుతోంది.
గురువారం నందిగామలో 38, గన్నవరంలో 37, తునిలో 36, విశాఖ, కాకినాడల్లో 35, కర్నూలు, అనంతపురంలలో 41, తిరుపతిలో 40 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ, ఆగ్నేయ గాలులు, ద్రోణి ప్రభావం పాక్షికంగా ఉన్న తెలంగాణలో కోస్తాతో పోల్చుకుంటే ఎండలు అధికంగానే ఉన్నాయి. నిజామాబాద్లో 41, రామగుండంలో 40, హైదరాబాద్లో 39 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలపై అప్రమత్తత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంచాలకులు సర్క్యులర్ జారీ చేశారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు మాసాలు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏరోజుకారోజు ప్రతి ఆస్పత్రి నుంచి పరిస్థితిపై నివేదిక హైదరాబాద్లోని డెరైక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో సెలైన్ బాటిళ్లు, వోఆర్ఎస్ ప్యాకెట్ల కొరత ఉన్నట్టు తెలిసింది.
వడగాడ్పులు వాయిదా...
Published Fri, Mar 25 2016 9:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement