నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ, టీఆర్‌ఎస్ | Fascist trend in the NDA, TRS | Sakshi
Sakshi News home page

నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ, టీఆర్‌ఎస్

Dec 16 2015 4:14 AM | Updated on Mar 18 2019 9:02 PM

నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ, టీఆర్‌ఎస్ - Sakshi

నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ, టీఆర్‌ఎస్

కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేస్తున్నాయని ఆలిండియా కాంగ్రెస్

19న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు

 సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేస్తున్నాయని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా విమర్శించారు. పార్టీ రాష్ట్ర నేతలు మల్లు రవి, డి.సుధీర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్‌లతో కలసి హైదరాబాద్ గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకూడదనే నియంతృత్వ ధోరణతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు.

వీటిని ప్రశ్నిస్తున్నందుకు సోనియాగాంధీపై, కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement