రంగారెడ్డి జిల్లా /యాచారం: ఎంతమంది.. ఎంత దూరం నుంచి తరలినా వారి ప్రయాణ ఖర్చులు వ్యాపారులే భరిస్తున్నారు. ఆయా విత్తన ప్యాకెట్లపై సరాసరి రూ.800 ఎమ్మార్పీ ఉండగా.. రూ.500కే రైతులకు విక్రయిస్తున్నారు.మంగళవారం యాచారం మండలం నుంచి 12 మంది రైతులు వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్లారు. ఇందుకు అయిన రవాణా ఖర్చు రూ.5వేలు. విత్తనాలు విక్రయించిన వ్యాపారే ఈ మొత్తాన్ని అందజేశాడు. భోజనం కోసం ఒక్కో రైతుకు రూ.వంద చొప్పున ఇచ్చాడు. పైగా ఎమ్మార్పీపై రూ.300 తగ్గించి రూ.500కే విత్తన ప్యాకెట్లు అమ్మారు.ఇలా 15రోజులుగా కొనుగోలు చేస్తున్న రైతులంతా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్ డివిజన్లలో ఇప్పటికే 5వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఎకరాకు రెండు చొప్పున 5 వేల ఎకరాల్లో 10 వేల ప్యాకెట్ల (450 గ్రాముల) విత్తనాలను విత్తారని అంచనా. ఒక్కో ప్యాకెట్కు రూ.500 చొప్పున లెక్కిస్తే.. అన్ని ప్యాకెట్లకు రూ.50లక్షలకు పైగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇతర మండలాల్లో మరో 5 నుంచి 10 వేల ఎకరాల వరకు పత్తిసాగు చేసినట్లు అంచనా. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.50 లక్షలకు పైగా విత్తనాల కోసం ఖర్చుపెట్టినట్లే.
అవసరాన్ని అవకాశంగా..
ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు అదునులో కురుస్తుండడం, గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో.. ప్రస్తుతం రైతులు పత్తి సాగుకు అధికంగా మొగ్గుచూపుతున్నారు. వాస్తవంగా పత్తి వాణిజ్య పంట. దీంతో ఆ విత్తనాలపై ప్రభుత్వం ఎటువంటి రాయితీ ఇవ్వకపోగా, స్వయంగా విక్రయాలు కూడా చేపట్టడం లేదు. దీంతో ఆ విత్తనాల లభ్యతకు ప్రైవేటు వ్యాపారులు, డీలర్లు ప్రత్యామ్నాయంగా మారారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు నాణ్యతను పక్కనబెట్టి.. నాసిరకం విత్తనాలను అందమైన ప్యాకెట్ల రూపంలో రైతులకు అంటగడుతున్నారు. వీటి విక్రయాల్లో తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ తరహా ఆఫర్లలో ‘భూత్పూర్’ విత్తనాలు ఒకటి.
నిత్యం పదుల సంఖ్యల గ్రామాల రైతులు అక్కడికి వెళ్లి పోటాపోటీగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.నొక్క యాచారం మండలం చౌదర్పల్లి గ్రామంలోనే వంద మందికిపైగానే ఆ విత్తనాలు తెచ్చుకున్నారు. జిల్లా వ్యాపారులు కూడా భూత్పూర్కు క్యూ కడుతున్నారు. అక్కడ తక్కువ ధరకు ప్యాకెట్లు కొనుగోలు చేసి.. ఇక్కడ ఎమ్మార్పీకి అంటగడుతుండడం గమనార్హం. స్థానికంగా పలుకబడి కలిగిన వ్యక్తులే దళారుల అవతారమెత్తి.. అమ్ముతుండడంతో విత్తనాలు నాణ్యమైనవో.. నాసిరకమైనవో తేల్చుకోకుండానే రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర జిల్లా సరిహద్దులు దాటి జిల్లాకు విస్తారంగా విత్తనాలు వస్తున్నా అధికారుల తనిఖీలు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ నాణ్యమైన విత్తనాలు కాకపోతే చివరకు బలయ్యేది రైతులే. దీన్ని గుర్తించి అధికారులు సూచనలు, సలహాలు అందిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
మాయా విత్తనం!
Published Tue, Jun 13 2017 11:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement