విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 6 2016 12:28 AM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన మండలంలోని సోడాషపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుట్టి లింగయ్య(48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తమ వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తూ కరెంట్‌ మోటార్‌ను ఆన్‌ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పక్కనున్న బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు.

సోడాషపల్లి(ధర్మసాగర్‌ ) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన మండలంలోని సోడాషపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుట్టి లింగయ్య(48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తమ వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తూ కరెంట్‌ మోటార్‌ను ఆన్‌ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పక్కనున్న బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మృతుడికి భార్య, వివాహమైన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement