విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Mar 1 2015 4:56 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతానికి ఒక రైతు బలయ్యాడు.

విశాఖపట్టణం: విద్యుదాఘాతానికి ఒక రైతు బలయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా చోడవరం మండలం లెక్కలవారి కల్లాలు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ముప్పిరెడ్డి అప్పారావు(40) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో తెగిపడి ఉన్న కరెంట్ తీగను గమనించకుండా అందులోకి దిగాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
(చోడవరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement