ఆగిన రైతు గుండె | Farmer is died | Sakshi
Sakshi News home page

ఆగిన రైతు గుండె

Jul 17 2016 9:16 PM | Updated on Oct 1 2018 2:44 PM

వానలు పడక పత్తిపంట ఎండిపోవడంతో అది చూసిన ఓ రైతు గుండె ఆగిపోయింది.

కౌతాళం: వానలు పడక పత్తిపంట ఎండిపోవడంతో అది చూసిన ఓ రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... రైతు వెంకోబ(34)కు పది ఎకరాల పొలం ఉంది. దీనికి అదనంగా మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 40 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంటను సాగు చేశాడు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.8వేలు ఖర్చు చేశాడు. అనుకోకండా వాతావరణంలో మార్పులతో పదిరోజులుగా వర్షాలు కురవక, విపరీత గాలితో దాదాపు 30 ఎకరాల పంట ఎండిపోంది. దీంతో రూ.3లక్షల నష్టం వాటిల్లిందని.. అప్పు ఎలా తీర్చాలంటూ చింతిస్తూ శనివారం రాత్రి గుండెపోటుకు గురై మతి చెందాడు. మతుడికి భార్య నరసమ్మ, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ఉన్నారు. కుటుంబ పెద్ద మతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement