ఆదివాసీలను చీల్చేందుకు కుట్ర | district seperation is dividing tribals, says yatra varavaraRao | Sakshi
Sakshi News home page

ఆదివాసీలను చీల్చేందుకు కుట్ర

Aug 24 2016 10:43 PM | Updated on Sep 4 2017 10:43 AM

జిల్లాల విభజనలో ఆదివాసీలను చీల్చే ప్రయత్నం సాగుతోందని విప్లవ కవి వరవరవరావు అన్నారు.

జిల్లాల విభజనపై వరవరరావు

ఇల్లెందు: జిల్లాల విభజనలో ఆదివాసీలను చీల్చే ప్రయత్నం సాగుతోందని విప్లవ కవి వరవరవరావు అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలో పర్యటించింది. ఒంపుగూడెం, కొమురారం, బద్రూ తండాల్లో పోడు భూముల్లో ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జైరాంరమేష్‌ల కుట్రల ఫలితంగా 7 మండలాలు, 3 లక్షల ప్రజలను ఆంధ్రాలో విలీనం చేశారన్నారు.

ప్రస్తుతం జిల్లాల విభజనలో నాలుగు ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాలను చీల్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆదివాసీలు మనుగడ కోసం, భూముల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ పోరాటం జరిగినా ఆదివాసీలే ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని వరవరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement