రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు | constable injured | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

Feb 14 2017 2:03 AM | Updated on Mar 19 2019 5:52 PM

కదిరి అర్బన్ : పట్టణ పరిధిలోని వెలుగు కార్యాలయం వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్‌ రాందాస్‌ నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాకు చెందిన రాందాస్‌నాయక్‌ పుట్టపర్తి పోలీస్‌ స్టేష¯ŒSలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

కదిరి అర్బన్ : పట్టణ పరిధిలోని వెలుగు కార్యాలయం వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ కొన్న  ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్‌ రాందాస్‌ నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాకు చెందిన రాందాస్‌నాయక్‌ పుట్టపర్తి పోలీస్‌ స్టేష¯ŒSలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై కదిరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెలుగు కార్యాలయం సమీపంలోకి రాగానే హిందూపురం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనింది.

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు కుడికాలుకు తీవ్ర గాయమైంది. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న కదిరి మండలం చౌటతండాకు చెందిన లక్ష్మీనాయక్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాందాస్‌నాయక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement