
ప్రశాంత్, యామిని(ఫైల్)
సోదరి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ అన్న బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం చోటుచేసుకుంది.
సోదరి ఆత్మహత్యను జీర్ణించుకోలేక అన్న బలవన్మరణం
ఏలూరు అర్బన్: సోదరి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ అన్న బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం చోటుచేసుకుంది. రోజు వ్యవధిలో కూతురు, కొడుకును కోల్పోయిన ఆ తల్లి రోదిస్తున్న తీరు చూసేవారికి కంటతడిపెట్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక చోడిదిబ్బకు చెందిన బరగడ యామిని మంగళవారం సాయంత్రం స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి పార్వతి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యామిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
నగరంలోనే బీటెక్ చదువుతున్న యామిని అన్న వర ప్రశాంత్ చెల్లెలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర ఆవేదనతో తల్లడిల్లిపోయాడు. బుధవారమంతా చెల్లెలి కర్మకాండల్లో పాల్గొన్న ప్రశాంత్ ఆ తర్వాత ఇంటికి రాలేదు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. రోజు వ్యవధిలో కూతురు, కొడుకు మిగిల్చిన పేగు కోతను తట్టుకోలేక గుండెలవిసేలా రోదిస్తోంది.