బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత | big security for thirumala brahmotsav: additional sp gopinath | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

Sep 10 2015 2:20 PM | Updated on Sep 3 2017 9:08 AM

గరుడ వాహనానికి అదనంగా 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి అదనపు ఎస్పీ గోపీనాథ్ అన్నారు.

తిరుమల: గరుడ వాహనానికి అదనంగా 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి అదనపు ఎస్పీ గోపీనాథ్ అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలో రెండు డ్రోన్ కెమెరాలు టీటీడీ ఏర్పాటు చేయనుంది. గరుడ వాహనం ముందు రోజు నుతంచి తిరుమల ఘాట్ రోడ్డుపై బైక్లను నిలిపివేస్తామని గోపినాథ్ చెప్పారు.

తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన ముఖ్య నిఘా అధికారి నాగేంద్ర కుమార్ సమీపక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు మొత్తం 4,500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమల గరుడ వాహనాన్ని పిల్లలు వృద్ధులు రాకుండా చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement