'రానున్న మూడేళ్లు దోచుకుంటామని ప్రతిజ్ఞ చేసే దీక్షలు' | alla nani takes on chandrababu | Sakshi
Sakshi News home page

'రానున్న మూడేళ్లు దోచుకుంటామని ప్రతిజ్ఞ చేసే దీక్షలు'

Jun 9 2016 12:44 PM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. గురువారం జంగారెడ్డిగూడెంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ...  చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు కాదు.... నయ వంచన దీక్షలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రానున్న మూడేళ్లు దోచుకుంటామని ప్రతిజ్ఞ చేసే దీక్షలు అంటు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

గోదావరి జలాలను పట్టిసీమ పేరుతో తరలించి... పారిశ్రామికవేత్తలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ధారదత్తం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 15వ తేదీన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటిస్తారని ఆళ్లనాని చెప్పారు. ఈ సమావేశంలో తలశిల రఘురాం, బాలరాజు, ఘంటా మురళీతోపాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement