- కూరగాయల తోటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ జాన్సుధీర్
అనంతపురం అగ్రికల్చర్: ఆగస్టు యాజమాన్యంతో కూరగాయల పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు నివారించుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించొచ్చని అన్నారు. కూరగాయల పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఆగస్టు యాజమాన్యం, తెగుళ్ల నివారణ తదితర విషయాలను వారు తెలియజేశారు.
కాయతొలుచు పురుగు నివారణ ఇలా..
+ వంగ, బెండలో మొవ్వ, కాయతొలుచు పురుగు నివారణకు తలవాల్చిన కొమ్మలు తుంచేసి, పుచ్చుపట్టిన కాయలు ఏరి నాశనం చేయాలి. తర్వాత 3 మి.లీ రైనాక్సిఫైర్ లేదా స్పైనోసాడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ టమాటలో ఆకుమాడు తెగులు (అర్లీబ్లైట్స్) ఆశిస్తే ఆకులు, కాండం, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా మాడి ఎండిపోతాయి. తేమ ఉన్నప్పుడు, చల్లని వాతావరణం తెగులు రావడానికి అనుకూలం. నివారణకు 3 గ్రాములు కాప్టాన్ లేదా మాంకోజెబ్ లేలా 2 గ్రాములు క్లోరోథలోనిల్ లేదా 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. టమాటలో పచ్చదోమ ఆశిస్తే ఆకుల అడుగు భాగం నుంచి రసంపీల్చడం ద్వారా ఆకు చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేణా ఆకు అంతా ఎర్రబడి ముడుచుకునిపోతాయి. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా మిథైట్ డెమటాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
+ మిరప నారు నాటేందుకు అనువైన సమయం : ఆరు వారాల వయస్సున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. హైబ్రిడ్ రకాలైతే పాదుకు ఒక మొక్క, సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు పెట్టుకోవాలి. నారుమడిలో అలాగే ఎదపెట్టిన పొలాల్లో నారుకుళ్లు తెగులు నివారణకు 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి భూమి బాగా తడిచేలా పిచికారీ చేయాలి. కొయనోఫారా ఎండుతెగులు నివారణకు 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1 గ్రాము స్ట్రెప్లోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ ఉల్లి సాగు చేసే రైతులు పొలాన్ని నాలుగైదు సార్లు దుక్కి చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో బోదెలు చేసుకొని రెండు వైపులా నాటుకోవచ్చు. 1 శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నారును నాటడం వల్ల నారుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. సాధ్యమైనంత మేర ఆగస్టు 15వ తేదీలోపు నాటుకోవడం ఉత్తమం. తామర పురుగుల నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 2 మి.లీ ఫిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి
Published Sun, Aug 13 2017 10:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement