ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ మంజూరు చేసింది.
జిల్లాకు 68,395 క్వింటాళ్ల విత్తనాలు
Feb 14 2017 11:53 PM | Updated on Sep 5 2017 3:43 AM
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ మంజూరు చేసింది. అన్ని రకాల విత్తనాలు కలిపి 68,395 క్వింటాళ్లు కేటాయించింది. ఇందులో వేరుశనగలు 50,600 క్వింటాళ్లున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 97500 క్వింటాళ్ల వేరుశనగకు ప్రతిపాదించగా సంగం మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కే-6 రకం వేరుశనగ 48,100 క్వింటాళ్లు, కే-9 రకం 2500 క్వింటాళ్లున్నాయి. మార్క్ఫెడ్ 25,600 క్వింటాళ్లు, ఆయిల్ఫెడ్ 25వేల క్వింటాళ్ల ప్రకారం సరఫరా చేస్తాయి. కందులు ఎల్ఆర్జీ -41 రకం 3500 క్వింటాళ్లు, పెసలు 500, మినుములు 3000, ఆముదం 650, కొర్ర 540, దయంచ 7500, పిల్లి పెసర 1200, ప్రొద్దుతిరుగుడు 125, ఉలవలు 50, సజ్జలు 200, జొన్నలు 130, మొక్కజొన్న 250, సోయాబీన్ 150 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు. వేరుశనగ మినహా మిగిలిన విత్తనాలను ఏపీసీడ్స్ సరఫరా చేస్తుంది. మే నెల చివరి నాటికి విత్తనాలు పొజిషన్ చేసి పంపిణీ చేపట్టడానికి వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ధరలు, సబ్సిడీ ఖరారు కావాల్సి ఉంది.
Advertisement


