ప్రేమికుడి వంచనతో యువతి ఆత్మహత్య | Young Women Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి వంచనతో యువతి ఆత్మహత్య

Feb 14 2019 1:09 PM | Updated on Feb 14 2019 1:09 PM

Young Women Commits Suicide in Karnataka - Sakshi

అర్పిత (ఫైల్‌)

వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించిన నిందితుడు కొద్ది కాలంగా యువతితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు.

కర్ణాటక  ,మైసూరు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమికుడు మోసం చేయడంతో మనస్థాపానికి గురై యువతి మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం జిల్లాలోని హుణుసూరు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కట్టెమళలవాడి పట్టణానికి చెందిన అర్పిత(19)అదే ప్రాంతానికి చెందిన లోకేశ్‌గౌడ అనే యవకుడు ఏడాది కాలంగా  పరస్పరం ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించిన నిందితుడు కొద్ది కాలంగా యువతితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు.

వివాహం చేసుకోవాలంటూ యువతి కొద్ది రోజులుగా ఒత్తిడి చేయడంతో లోకేశ్‌గౌడ ముఖం చాటేశాడు. మోసాన్ని తట్టుకోలేకపోయిన అర్పిత   మరణ వాంగ్మూలాన్ని రాసి ఆత్మహత్యకు పాల్పడింది.  ప్రేమ పేరుతో నమ్మించి దారుణంగా మోసం చేసిన లోకేశ్‌గౌడకు జీవితఖైదు శిక్ష విధించాలని, తన మరణానికి లోకేశ్‌గౌడనే కారణమని పేర్కొంటూ వాంగ్మూలంలో పేర్కొంది. అర్పిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు హుణుసూరు పోలీసులు కేసు  దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement