ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్‌’ | Young Man Pass On After Drinking Too Much Alcohol In Nirmal | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్‌’

Jul 14 2020 8:47 AM | Updated on Jul 14 2020 12:47 PM

Young Man Pass On After Drinking Too Much Alcohol In Nirmal - Sakshi

రసూల్‌(ఫైల్‌)

సాక్షి, నిర్మల్‌: క్షణికావేశంలో మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఎస్సై వినయ్‌ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన షేక్‌ రసూల్‌(31) మామడ మండలం అనంతపేట్‌ గ్రామంలో మేస్రీ్తగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఐదుగురు మేస్త్రీలు కలిసి సోమవారం మద్యం సేవించారు. ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని 15నివిుషాలలో తాగితే రూ.25వేలు ఇస్తామని ఇద్దరు మేస్త్రీలు రసూల్‌తో పందెం కాశారు.

దీంతో ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని రసూల్‌ సేవించాడు. బాటిల్‌లో సగం వరకు తాగి కింద పడిపోయాడు. అపస్మారకస్థితికి వెళ్లడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రసూల్‌తో కలిసి మద్యం తాగినవారు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో షేక్‌ నజూరుబాషా, రత్తయ్యలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రసూల్‌కు భార్యతో పాటు కుమారుడు ఉన్నారు. 

విషాదం: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆపై.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement