కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు

Woman In Kanpur Beaten To Death By Minor Daughters Alleged Molesters - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసును వెనక్కి తీసుకోనందుకు మైనర్‌ బాలిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దాడిలో బాధితురాలికి కూడా తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 2018లో జరిగిన లైంగిక దాడి నిందితులు చేసిన దాష్టీకమే ఇది.

చదవండి: దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!

కాన్పూర్‌కి చెందిన మైనర్ బాలికపై అబిద్, మింటు, మహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే ఆరుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. కాగా.. ప్రస్తుతం నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికొచ్చిన ఆ యువకులు బాధితురాలి ఇంటికి వెళ్లి కేసును విత్‌ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు.

చదవండి: వీడియో తీసుకుని... ఉరి వేసుకుని... 

ఇందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో బాధితురాలి తల్లిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. కిందపడిపోయిన ఆమె తలపై కాలితో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మహిళతోపాటు కూతురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఆస్పత్రిలో చనిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top