అత్తా, కోడలు దారుణ హత్య | Two Women Murdered In Ranga Reddy | Sakshi
Sakshi News home page

అత్తా, కోడలు దారుణ హత్య

May 7 2019 7:19 AM | Updated on May 7 2019 4:23 PM

Two Women Murdered In Ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మైలార్‌దేవుపల్లి పరిధి వడ్డేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి అత్తా, కోడలిని దారుణంగా నరికి చంపారు. అత్త నబీనాబేగం(55), కోడలు తాయబ్(25) హత్యకు గురయ్యారు. తాయబ్‌ భర్త రాత్రి విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గల కారణం తెలియరాలేదు.మృతులు నిజామాబాద్‌ జిలా కోటగిరికి చెందిన వారిగా గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement