పిడుగుపాటు; తీవ్ర విషాదం

Three Members In Family Died With Thunderbolt In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలోని దారూర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడటం పలువురిని కలచి వేసింది. వివరాలు.. రాజాపూర్‌ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్‌ కుటుంబం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా పిడుగు పడటంతో భార్య ఖాజాబి(38), కూతురు తబస్సుమ్‌(16), కుమారుడు అక్రం(12) అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఫక్రుద్దీన్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పిడుగుపాటుతో ఫక్రుద్దీన్‌ కుటుంబం మృత్యువాత పడటంతో రాజపూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top