వారాంతం.. విషాదాంతం | Three dead in the road accident | Sakshi
Sakshi News home page

వారాంతం.. విషాదాంతం

Jan 29 2018 3:30 AM | Updated on Aug 30 2018 4:15 PM

Three dead in the road accident - Sakshi

ప్రమాద స్థలంలో యువకుల మృతదేహాలు. (ఇన్‌సెట్‌లో) ప్రమాదానికి గురైన కారు

చేవెళ్ల: వారాంతాన్ని సరదాగా గడుపుదామనుకున్న ఉద్యోగుల జీవితాలు విషాదాంతం అయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి కుటుంబాల్లో విషాదం నింపింది. కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు స్నేహితుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో నివాసముండే కాసపోగు ప్రవీణ్‌(26), డేవిడ్‌జాన్సన్‌(34), అరు గొండ అర్జున్‌కుమార్‌(25), శ్రావణ్‌ స్నేహితులు.

ప్రవీణ్, అర్జున్‌కుమార్, శ్రావణ్‌ ఉప్పల్‌లోని జెన్‌పాక్‌ కంపెనీ ఉద్యోగులు. డేవిడ్‌ జాన్సన్‌ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. వారాంతాన్ని సరదాగా గడుపుదామని ప్రవీణ్‌కు చెందిన ఆల్టో కారులో వికారాబాద్‌కు లాంగ్‌డ్రైవ్‌ ప్లాన్‌ చేసుకున్నా రు. ఉదయం నగరం నుంచి బయలుదేరారు. ప్రవీణ్‌ కారు నడుపుతున్నాడు. కారు అతివేగంగా వెళ్తూ మీర్జాగూడ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్, అర్జున్, డేవిడ్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

శ్రావణ్‌ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి శ్రావణ్‌ను ‘108’ అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నా రు. ఈ మలుపు వద్ద మూడేళ్ల క్రితం కూడా ప్రమాదం చోటు చేసుకుందని, అప్పుడు కూడా ముగ్గురు యువకులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని స్థానికులు గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement