పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

Student Commits Suicide By Taking Insecticide In Mancherial - Sakshi

సాక్షి,దండేపల్లి(మంచిర్యాల) : చదువులో వెనకబడటంతో మనస్తాపానికి గురైన బీటెక్‌ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం చింతపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, ఏఎస్సై పాల్‌ కథనం ప్రకారం వివరాలు.. చింతపల్లికి చెందిన గడ్డం సాయినిఖిల్‌ (21) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను చదువులో కొంత వెనకబడి ఉన్నాడు. దీంతో నెల రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదు. ఇంటి వద్దనే ఉంటూ దిగాలు పడుతున్న అతను మనస్థాపం చెంది, ఈ నెల 11న సాయంత్రం పొలం వద్దకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లాడు.

అక్కడ పురుగుల మందు తాగినట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందడంతో కుటుంబీకులు అక్కడకు వెళ్లి వెంటనే లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గురువారం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి గడ్డం సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top