మద్యం షాపు వద్ద ఘర్షణ.. బీర్‌ బాటిల్‌తో..

One Died By Attacking Beer Bottle In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : మద్యం షాపు వద్ద ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బీర్‌బాటిల్‌తో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం షాపు వద్ద ఇద్దరు వ్యక్తులు (పూర్ణ శేఖర్‌, రమేష్‌) ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్‌.. బీర్‌ బాటిల్‌తో పూర్ణ గొంతుకోసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top