చికెన్‌పకోడి తినలేదని ఆత్మహత్య

Man died With Suicide In Gudivada - Sakshi

సాక్షి, గుడివాడ(కృష్ణా) :  తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చికెన్‌ పకోడి తినలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ధనియాలపేటలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి వన్‌టౌన్‌ సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాలు ప్రకారం ధనియాలపేటకు చెందిన తెర్లి శ్రీనివాసరావు(25) మత్య్సశాఖలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ధనియాలపేటలో ఉండే ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీను తాను తెచ్చుకున్న చికెన్‌ పకోడిని తినాల్సిందిగా ఝాన్సీని కోరాడు ఆమె తినకపోవటంతో సోమవారం రాత్రి గొడవ పడ్డాడు. నాపై ప్రేమ లేదని అందుకే తినటం లేదని అన్నాడు. మంగళవారం ఉదయం ఝాన్సీ తనకుమార్తెను స్కూలుకి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఝాన్సీ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top