భార్య తల నరికిన భర్త

husband Kileed Wife In Karnataka - Sakshi

తలతో పోలీస్‌ స్టేషన్‌లోలొంగుబాటు  

వివాహేతర సంబంధం పర్యవసానం

చిక్కమగళూరు జిల్లాలో ఘటన

కర్ణాటక, యశవంతపుర : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఓ భర్త ఆమె తల నరికి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు... ఇక్కడికి సమీపంలోని శివని రైల్వేస్టేషన్‌ సమీపంలో సతీశ్, రూప (28)లు నివాసం ఉంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్‌కు డ్రైవర్‌గా సతీష్‌ పనిచేస్తున్నాడు. అక్కడ రూప వ్యవహారం నచ్చక కుటుంబాన్ని అజ్జంపురకు మార్చాడు. అక్కడే ఓ మాంసం దుకాణం పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే రూప అదే ఊరుకు చెందిన సునీల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఇది తెలిసిన సతీష్‌ పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. అయినా కూడా రూపలో మార్పు కనిపించలేదు. ఆదివారం సాయంత్రం సునీల్‌తో కలిసి ఉండటాన్ని నేరుగా చూసిన సతీష్, సునీల్‌పై కొడవలితో దాడికి యత్నించాడు. అతను తప్పించుకుని పారిపోవడంతో ఆవేశంతో భార్య రూప తల నరికివేశాడు. అనంతరం 20 కిలోమీటర్ల దూరంలోని అజ్జంపుర పోలీసుస్టేషన్‌కు తల తీసుకుని వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తాను భార్య ను ఎంతో ప్రేమతో చూసుకున్నా ఇటువంటి వ్యవహారంతో విసిగిపోయానని, తనకు ఎటువంటి శిక్ష విధించినా అనుభవిస్తానని పోలీసుల తో వాపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top