ఐదుగురు బీజేపీ కార్యకర్తల దుర్మరణం | Five BJP Workers Dead In Car Accident At Himachal Pradesh | Sakshi
Sakshi News home page

ఐదుగురు బీజేపీ కార్యకర్తల దుర్మరణం

May 5 2019 6:25 PM | Updated on May 5 2019 6:25 PM

Five BJP Workers Dead In Car Accident At Himachal Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల కారు మండి జిల్లాలోని ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాగూర్‌ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు సమాచారం. మార్గ మధ్యలో కారులో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement