ఏడాది శిశువు సహా దంపతులు ఆత్మహత్య | family suicide in karnataka | Sakshi
Sakshi News home page

ఏడాది శిశువు సహా దంపతులు ఆత్మహత్య

Feb 14 2018 7:05 AM | Updated on Jul 10 2019 8:00 PM

family suicide in karnataka - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు సోమశేఖర్, సుధ (ఫైల్‌)

రామనగర (దొడ్డబళ్లాపురం) : అప్పుల బాధ తాళలేక పట్టుగూళ్ల వ్యాపారి కుట ంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర తా లూకా లక్ష్మిపుర గ్రామంలో చోటుచేసుకుంది. సోమశేఖర్‌ (36),  ఆయన భార్య సుధ (27), వీరి కుమారుడు ప్రీతం (ఏడాది) ఆత్మహత్య చేసుకున్నారు. సోమశేఖర్‌ వత్తిరీత్యా పట్టుగూళ్ల వ్యాపారి. కొన్ని రోజుల క్రితం సోమశేఖర్‌ రైతుల నుంచి అప్పుకింద పట్టుగూళ్లు ఖరీదుచేసి వ్యాపారం చేశాడు. అయితే వ్యాపారం సరిగా జరగక నష్టం వచ్చింది. రూ.3 లక్షలు అప్పు మిగిలింది.

రైతులు సోమవారం ఇంటి వద్దకు వచ్చి అప్పుతీర్చమని గొడవ చేసి వెళ్లారు. దీంతో సాయంత్రానికి సుధ తన ఏడాది కుమారుడు ప్రీతంకు ఉరివేసి, అనంతరం తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తరువాత ఇంటికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసిన సోమశేఖర్‌ కూడా కలతచెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొద్దుపోయాక ట్యూషన్‌కు వెళ్లిన వీరి కూతురు ఇంటికి వచ్చి చూడగా సంఘటన వెలుగు చూసి ంది. కనకపుర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement