ఏడాది శిశువు సహా దంపతులు ఆత్మహత్య

family suicide in karnataka - Sakshi

అప్పుల బాధ తాళలేక పట్టుగూళ్ల వ్యాపారి అఘాయిత్యం

అనాథగా మిగిలిన కుమార్తె

రామనగర (దొడ్డబళ్లాపురం) : అప్పుల బాధ తాళలేక పట్టుగూళ్ల వ్యాపారి కుట ంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర తా లూకా లక్ష్మిపుర గ్రామంలో చోటుచేసుకుంది. సోమశేఖర్‌ (36),  ఆయన భార్య సుధ (27), వీరి కుమారుడు ప్రీతం (ఏడాది) ఆత్మహత్య చేసుకున్నారు. సోమశేఖర్‌ వత్తిరీత్యా పట్టుగూళ్ల వ్యాపారి. కొన్ని రోజుల క్రితం సోమశేఖర్‌ రైతుల నుంచి అప్పుకింద పట్టుగూళ్లు ఖరీదుచేసి వ్యాపారం చేశాడు. అయితే వ్యాపారం సరిగా జరగక నష్టం వచ్చింది. రూ.3 లక్షలు అప్పు మిగిలింది.

రైతులు సోమవారం ఇంటి వద్దకు వచ్చి అప్పుతీర్చమని గొడవ చేసి వెళ్లారు. దీంతో సాయంత్రానికి సుధ తన ఏడాది కుమారుడు ప్రీతంకు ఉరివేసి, అనంతరం తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తరువాత ఇంటికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసిన సోమశేఖర్‌ కూడా కలతచెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొద్దుపోయాక ట్యూషన్‌కు వెళ్లిన వీరి కూతురు ఇంటికి వచ్చి చూడగా సంఘటన వెలుగు చూసి ంది. కనకపుర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top