తల్లిదండ్రుల గొడవలో కుమార్తె మృతి

Daughter Died In Parents Stir - Sakshi

గోరంట్ల: తగువులాడుతున్న తల్లిదండ్రులను విడిపించబోయిన కుమార్తె.. ఆవేశంలో తండ్రి తోసేయడంతో కిందపడి మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. గుంటిపల్లి తండాకు చెందిన వృద్ధులు రాంజీనాయక్, సాలీబాయి దంపతులు.

వితంతువైన కుమార్తె చిట్టిబాయి (40)కూడా వీరివద్దే ఉంటోంది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో తల్లిదండ్రులు గొడవ పడుతుండటంతో చిట్టిబాయి విడిపించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తండ్రి బలంగా తోసేయడంతో చిట్టిబాయి కిందపడింది. బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిట్టిబాయికి ఒక కుమార్తె ఉంది. పుట్టపర్తి రూరల్‌ సీఐ రవికుమార్, ఎస్‌.ఐ సుధాకర్‌యాదవ్‌ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చిట్టిబాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top