అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా | Bus Rolled Over On Road By Excess Speed In Pamurai Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

Oct 10 2019 6:49 AM | Updated on Oct 10 2019 10:13 AM

Bus Rolled Over On Road By Excess Speed In Pamurai Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మార్నింగ్‌ స్టార్‌కు చెందిన ట్రావెల్‌ బస్సు పామురాయి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా బస్సును పక్కకు తొలగించారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను పోలీసులు అక్కడి స్థానికుల సహాయంతో బయటికి తీసి రక్షించారు. కాగా ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన కారుణ్య(28), శిరీష(30), అవంతి(25), మరొకరికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement