నవ వధువు అదృశ్యం

Bride Missing Case Files  In Krishna - Sakshi

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): నవ వధువు అదృశ్యమైన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. భార్య అదృశ్యంపై  భర్త కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం... కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్‌కు చెందిన  అడ్డూరి శంకర్‌(23)కు మార్చి 4వ తేదీ ప్రియాంకతో వివాహం అయింది.  శంకర్‌ సెల్‌ఫోన్‌ షాపులో పని చేస్తుంటాడు. ప్రియాంక ఇంటి వద్దే ఉంటోంది.  ఈనెల 5వ తేదీ ఉదయం శంకర్‌ షాపుకు వెళ్లిపోగా, సాయంత్రం ప్రియాంక అన్నయ్య కిషోర్‌ ఫోన్‌ చేశాడు. మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని గుర్తించారు.  ఆమె కోసం స్నేహితులు, బంధువులను  ఆరా తీశారు. ఆచూకీ లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహిత అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top