ఎగ్జిబిషన్లో అపశ్రుతి.. 15మందికి గాయాలు
సాక్షి, నిజామాబాద్ : ఎగ్జిబిషన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎయిర్బెలూన్ కుప్పకూలి దాదాపు 15మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం నిజామాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎగ్జిబిషన్లో ఎయిర్ బెలూన్లోడ్ ఎక్కువ అయి.. గాలి లీక్ కావటంతో అదికాస్తా కుప్పకూలింది. ఈ సంఘటనలో 15మంది గాయపడగా బయటఉన్న ఓ బాలుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఎగ్జిబిషన్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు, బాధితులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.