
ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
శుక్రవారంనాటి మార్కెట్లు ఫ్లాట్ గా మొదలయ్యాయి
ముంబై: శుక్రవారంనాటి మార్కెట్లు ఫ్లాట్ గా మొదలయ్యాయి. అనంతరం మెల్లిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల నస్టంతో 26,959 దగ్గర, నిఫ్టీ15 పాయింట్ల నష్టంతో 8,164 దగ్గర ట్రేడవుతున్నాయి. మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ వుంటే సెన్సెక్స్ 27 వేల మార్కుకు దిగువన ట్రేడవుతూ నెగిటివ్ సంకేతాలను సూచిస్తోంది. ముఖ్యంగా టెలికాం షేర్లు నష్టాల్లో చవిచూసు చూస్తున్నాయి. ఎయిర్ టెల్ మూడు శాతం నష్టాల్లో కొనసాగుతోంది. ఐటీసి, యాక్సింగ్ బ్యాంక్ , కోల్ ఇండియా, హెచ్ యుల్ షేర్లలోని నష్టాలు మార్కెట్ ను భాగా ప్రభావితం చేస్తున్నాయి.
అటు రూపాయి కూడా న ష్టాల్లో ట్రేడవుతోంది. 13 పైసల నష్టంతొ 64.95 దగ్గర ఉంది. మరోవైపు బీహార్ లో రెండో దశ పోలింగ్ నేపథ్యంలో ఈ ప్రభావం కూడా మార్కెట్ పై చూపనుంది.