రూ.47 వేల వద్ద స్థిరంగా పసిడి

Gold price today - Sakshi

మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గి ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 10:40 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.56 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.47,129 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర 9 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం 1,748.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండడంతో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇన్వెస్టర్లు  భావిస్తుండడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top