స్వల్పంగా పెరిగిన పసిడి ధర

today gold price - Sakshi

గత రెండురోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.300 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.46,388 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 11 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,716.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తుండడంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 1.5 శాతం తగ్గడంతో వరుసగా మూడోవారం బంగారం ధరలు పతనాన్ని చవిచూశాయి.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top