యాక్సిస్ బ్యాంక్ ‘సెక్యూర్ ప్లస్’ డెబిట్ కార్డ్
ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ సరికొత్త అధునాతన ఫీచర్లతో కూడిన ‘సెక్యూర్ ప్లస్’ అనే డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది.
ముంబై : ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ సరికొత్త అధునాతన ఫీచర్లతో కూడిన ‘సెక్యూర్ ప్లస్’ అనే డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ యాప్ను ఉపయోగించి ఈ కార్డులు స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఈ కార్డులో మోసాలబారిన పడకుండా రక్షణ కల్పించడంతోపాటు ఏవైనా వివాదాస్పద లావాదేవీలు జరిగితే రూ.75 వేల వరకు పరిహారం, రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా అందించడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్డు వినియోగంపై ఏడాదికి రూ.300లను చార్జ్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ జైరామ్ శ్రీధరన్ తెలిపారు.


