రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చించాలి | ysr congress party to give adjournment motion debate on ap capital | Sakshi
Sakshi News home page

రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చించాలి

Sep 4 2014 8:29 AM | Updated on Aug 18 2018 5:48 PM

రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చించాలి - Sakshi

రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చించాలి

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రకటనకు ముందే అసెంబ్లీలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రకటనకు ముందే అసెంబ్లీలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.  రాజధాని అంశంపై రూల్ 53 కింద ఆ పార్టీ నోటీసు ఇచ్చింది. ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. కాగా రాజధాని ఎక్కడైనా తమకు ఓకే అని, అయితే చర్చ జరగకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే దానిపై  ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement