హైదరాబాద్: రాష్ట్రాన్ని విడగొట్టినా, తెలుగు జాతిని మాత్రం విడగొట్టలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోకూడా వైఎస్సార్సీపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యంకోసం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన రెండు శిక్షణా శిబిరంలో బుధవారం వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేశారు. ఆయన మాటల్లోనే...
''రాష్ట్రాన్ని విడగొట్టి.. భావోద్వేగాలను సొమ్ముచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య ఎన్నికలకు వెళ్తున్నాం. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉంటేనే మేలు జరుగుతుంది. ప్రతిపక్షం, అధికారపక్షం కుమ్మక్కైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కలిపి ఉంచలేకపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టాం... పెద్దమ్మను నేను అని ఒకరు, చిన్నమ్మను నేనని మరొకరు ఓట్లు అడిగే పరిస్థితి. రాష్ట్రాన్ని విడగొట్టాం కాబట్టి పొత్తు, లేదా విలీనం చేయండని ఇంకొకరు అడిగే పరిస్థితి. నా లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టారంటూ విజయోత్సవాలు జరుపుకోమని ఇంకొకరు చెప్పే పరిస్థితి. ఫలానా మంచి పనులు చేసి ఓట్లడిగే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. రాజన్న రాజ్యాన్ని తూట్లు పరుస్తూ ఐదేళ్లు పాలించారు. అడ్డగోలు విభజనలో భాగస్వాములైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లది ఒకే రకమైన వైఖరికాదా?
ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఈ పార్టీలు రాజకీయాలు చేయడంలేదు. రాష్ట్రాన్ని విడగొట్టారు.. భూములైతే వేరు చేశారు.. తెలుగు జాతిని మాత్రం వీరు విడగొట్టలేరు. తెలుగువారు ఎక్కడున్నా.. వారి మనసులు, వారి ఆప్యాయతలు వీరువిడగొట్టలేరు. సమైక్యమన్న విధానాన్ని వైఎస్సార్సీపీ ఎంచుకుంది. సమైక్య మంటే.. తెలంగాణలో కూడా అన్నదమ్ములున్నారని, రాయసీమలో కూడా అన్నదమ్ములున్నారని, కోస్తాలో కూడా అన్నదమ్ములున్నారని అర్థం. సమైక్యమంటే తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తాంధ్రనాది అన్న భావనే. ప్రేమ, ఆప్యాయతలు అక్కడా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి అని చెప్పడమే సమైక్యం. ఇదే నినాదంతో తెలంగాణలోకి కూడా వెళ్తాం. తెలంగాణలో కూడా వైఎస్సార్సీపీ ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తుంది. ప్రతి పేదవాడి గుండెచప్పుడు వినడానికి, వారి మనసు తెలుసుకోవడానికి కృషిచేస్తుంది. మరణాంతరం కూడా ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోవడానికి కృషిచేస్తుంది' అని జగన్ తన ప్రసంగం ముగించారు.
అదే నినాదంతో తెలంగాణలోకి వెళ్తాం: జగన్
Published Wed, Feb 26 2014 2:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement