యువకుడిని బలిగొన్న లారీ | Young man died in road accidents | Sakshi
Sakshi News home page

యువకుడిని బలిగొన్న లారీ

Mar 13 2014 12:32 AM | Updated on Aug 30 2018 3:56 PM

జాతీయ రహదారిపై ధర్మవరం వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

ప్రత్తిపాడు, న్యూస్‌లైన్ :జాతీయ రహదారిపై ధర్మవరం వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన యనమల దుర్గబాబు మోటార్ బైక్‌పై బుధవారం ప్రత్తిపాడు బయలుదేరాడు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తుతున్న లారీ అతడి బైక్‌ను ఢీకొంది. దీంతో దుర్గబాబు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. లారీని స్థానికులు వెంబడించడంతో ప్రత్తిపాడు పెట్రోల్ బంక్ వద్ద నిలిపివేసి, డ్రైవర్ పరారయ్యాడు.
 
 చెందుర్తి గ్రామానికి చెందిన యనమల త్రిమూర్తులుకు కుమారుడు దుర్గబాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. దుర్గబాబుకు చెందిన గేదెను రెండు రోజుల క్రితం పిచ్చికుక్క కరిచింది. గేదెకు వైద్యం చేయించే సమయంలో దుర్గబాబు చేతిపై గేదె నోటి నుంచి నురగ పడింది. దీంతో ఇంజెక్షన్ చేయించుకోవాలని బంధువులు అతడికి సూచించారు. దీంతో టీటీ ఇంజెక్షన్ చేయించుకునేందుకు బైక్‌పై ప్రత్తిపాడు వస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే సరికి దుర్గబాబు మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement