మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
ఆళ్లగడ్డ: మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక పి. చింతకుంట కాలనీలో నివాసముంటున్న హోంగార్డు భార్య ఇంట్లో పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.