రాయచోటి టౌన్ : వీరబల్లిలోని కస్తూర్బా పాఠశాల నుంచి గురువారం అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. అమ్మను చూడాలనే తాను తన స్నేహితురాలిని వెంట తీసుకుని తిరుమలకు వెళ్లానని ఉషారె డ్డి అనే బాలిక పేర్కొంది. శనివారం బాలికలను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వీరబల్లి మండలం గడికోట ఎడపల్లెకు చెందిన ఉషారెడ్డి వీరబల్లిలోని కస్తూ ర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు కామేశ్వరి, నాగారెడ్డి. ఉషారెడ్డి జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అప్పటి నుంచి ఆ బాలిక తండ్రి వద్దే ఉంటోంది. తల్లి తిరుమలలో చిరుద్యోగం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తన తల్లిని చూడాలనే ఉద్దేశంతో తనతో పాటు చదువుకుంటున్న చార్మి అనే బాలికతో తిరుపతికి వెళ్లి వద్దామని చెప్పింది. దీంతో ఆ బాలిక తన వద్ద ఉన్న రూ.200 తీసుకుని మరో బాలిక ను వెంట తీసుకుని బయలు దేరింది. తొలుత వీరు తిరుపతికి కాకుండా నేరుగా బస్సులో కదిరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి తిరుపతి బస్సు ఎక్కి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన తర్వాత ఆ బాలిక తన తాతకు కాయిన్బాక్స్ నుంచి ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్లి తిరిగి వస్తానని తన కోసం వెతక వద్దని చెప్పింది. ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలిపాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ బాలికలు తిరుపతిలో ఉన్నారని తెలుసుకుని వీరబల్లి ఎస్ఐ భక్తవత్సలం తన సిబ్బందితో కలసి తిరుపతికి వెళ్లి గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో ఆ బాలిక మళ్లీ ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్తున్నానని చెప్పింది. ఆ ఫోన్ నెంబర్ తిరుమలదని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో తిరుమలలో గాలిస్తుండగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరబల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులని తెలిసింది. దీం తో వారిని రాయచోటికి తీసుకొచ్చారు. అలాగే ఆ బాలిక తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్కు పిలిపించి బాలికను అప్పగించారు. మరో బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ తెలిపారు.
అమ్మను చూడాలని వెళ్లా
Published Sun, Sep 13 2015 3:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement