టీటీడీ: కొత్త పాలక మండలి అసహనం.. బుజ్జగింపులు! | TTD New Trust Board to take oath today | Sakshi
Sakshi News home page

Apr 28 2018 12:49 PM | Updated on Aug 28 2018 5:43 PM

TTD New Trust Board to take oath today - Sakshi

సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో నూతన పాలకమండలి శనివారం ప్రమాణం స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 11మంది పాలక​ మండలి సభ్యులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ క్రమంలో ఉదయం దర్శనం కోసం వచ్చిన నూతన పాలక మండలి సభ్యులను, వారి కుటుంబ సభ్యులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తుల రద్దీ దృష్టి కొద్దిసేపు సిబ్బంది నిలిపేశారు.

దీంతో టీటీడీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ నూతన పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీటీడీ ఇన్‌చార్జ్‌ సీవీఎస్వో శివకుమార్‌ రెడ్డి, అధి​కారులు నూతన సభ్యులను బుజ్జగించి తీసుకొచ్చారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో తమకు అసౌకర్యం కలుగజేస్తున్నారంటూ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement