టైర్ల దొంగల ముఠా అరెస్ట్ | Tire gang of thieves arrested | Sakshi
Sakshi News home page

టైర్ల దొంగల ముఠా అరెస్ట్

Nov 18 2015 12:48 PM | Updated on Aug 28 2018 7:30 PM

రోడ్డుపై ఆగిఉన్న లారీల టైర్లు దొంగిలించే ఆరుగురు సభ్యుల ముఠాను తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

 తాడిపత్రి: రోడ్డుపై ఆగిఉన్న లారీల టైర్లు దొంగిలించే ఓ ముఠాను తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తాడిపత్రి రూరల్‌ పరిధిలోని కడప రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే 22 జతల టైర్లు, డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా పాకాల, తిరుపతి పట్టణాలకు చెందిన పాపయ్యనాయుడు, హరి, హేమాంబరి, మోహన్‌రెడ్డి అనే వారు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో లారీల టైర్ల దొంగతనాలనే వృత్తిగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన పెద్దిరెడ్డి అనే వ్యక్తికి చెందిన లారీ టైర్లను ఎత్తుకుపోయారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుల్లో మోహన్‌రెడ్డి పరారీలో ఉండగా మిగతా వారందరినీ అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం నిందితులను రిమాండ్‌కు తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement