దర్శ గ్రామం పుట్టంరాజువారి కండ్రిగలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా సుమారు 40 మంది జ్వరాల బారిన పడి అస్వస్థతకు గురయ్యారు.
గూడూరు రూరల్: ఆదర్శ గ్రామం పుట్టంరాజువారి కండ్రిగలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా సుమారు 40 మంది జ్వరాల బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది కీళ్లనొప్పులు, నీరసంతో మంచాలకే పరిమిత మయ్యారు.
నాలుగు రోజుల క్రితమే డిప్యూటీ డీఎంహెచ్ఓ గ్రామాన్ని సందర్శించి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే జ్వరాలు ప్రబలుతుండటం గమనార్హం. మరోవైపు నెర్నూరు ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు గొల్లపల్లిలోనూ పలువురు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గొల్లపల్లికి చెందిన ఓ వ్యక్తిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో చెన్నైకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. చెన్నూరు పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సునీల్ స్పందిస్తూ జ్వరాలు ప్రబలుతున్న విషయం వాస్తవమేనని, బుధవారం ఇంటింటికి వెళ్లి మందులను అందించామన్నారు. గురువారం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.