రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం | The burning of crops, the farmers do not land in the capital | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం

Dec 29 2014 8:13 AM | Updated on Oct 1 2018 2:00 PM

రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం - Sakshi

రాజధాని గ్రామాల్లో దుండగుల అరాచకం

రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల గ్రామల్లో దుండగుల అర్థర్రాతి అరాచకం సృటించారు.

గుంటూరు : గుంటూరు జిల్లాలో ప్రైవేట్ మాఫియా రెచ్చిపోయింది.  రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించారు.  వరిగడ్డి వాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో పాటు మూడు గ్రామాల్లో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.


సుమారు 20 నుంచి 30మంది ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోనే కాకుండా, లోపల ఉన్న పొలాలకు కూడా దుండగులు నిప్పు పెట్టారు.  ఈ సంఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎదుర్కోలేకే... ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కూడా తాము రాజధానికి భూములు ఇచ్చేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement