అది డబ్బులిచ్చి చేయించుకున్న సర్వే | That was a paid survey | Sakshi
Sakshi News home page

అది డబ్బులిచ్చి చేయించుకున్న సర్వే

Dec 1 2016 1:43 AM | Updated on Aug 18 2018 4:06 PM

రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక ఫ్లాష్ టీం సర్వే పేరుతో దొంగ సర్వేలను ప్రచురించిందని వైఎస్సార్ జిల్లా టీడీపీ సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.

ఆంధ్రజ్యోతి సర్వేపై టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ వ్యాఖ్యలు

 అన్నవరం(చాపాడు):  రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక ఫ్లాష్ టీం సర్వే పేరుతో దొంగ సర్వేలను ప్రచురించిందని వైఎస్సార్ జిల్లా టీడీపీ సీనియర్ నేత  పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.

బుధవారం మైదుకూరు నియోజకవర్గం అన్నవరం గ్రామంలో  జన చైతన్య యాత్ర లో  ప్రజలతో మాట్లాడుతూ డబ్బులు తీసుకుని సర్వేల పేరుతో తప్పుడు నివేదికలను ప్రచురించారన్నారు. ఆ పత్రికలో ప్రచురితమైన తప్పుడు సర్వేలను ప్రజలెవ్వరూ నమ్మెద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement