పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గుంటూరు జిల్లాలో ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరావతి, న్యూస్లైన్ : పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గుంటూరు జిల్లాలో ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా అమరావతి మండలం నూతలపాటివారిపాలేనికి చెందిన గోళ్ల సూర్యనారాయణ (29) ఎకరం సొంత పొలానికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా మిర్చి, పత్తి పంటలు సాగుచేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులకు రూ.4 లక్షలకు పైగా అప్పు చేశాడు. దిగుబడి ఆశాజనకంగా లేక నషా ్టలు రావడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమం లో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. శనివారం వేకువజామున కుటుంబసభ్యులు గమనించేసరికి సూర్యనారాయణ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.