
పోలవరంతో తెలంగాణకు అన్యాయం జరగదు: వెంకయ్య
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం ఏమీ జరగదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం ఏమీ జరగదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వాస్తవాల డాక్యుమెంట్ల పుస్తకాన్ని ఆయన విజయవాడలో ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలోకి వస్తాయని, 45 టీఎంసీల నీళ్లను రాయలసీమకు ఇవ్వచ్చని వెంకయ్యనాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 9 మండలాలు మాత్రమే నీట మునుగుతాయని చెప్పారు. నదులను అనుంధానం చేయడం వల్ల కరువు ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతాయని ఆయన అన్నారు.