మా సచివాలయాన్ని ధ్వంసం చేస్తారా? | telangana employees objection on remove of library in secretariat | Sakshi
Sakshi News home page

మా సచివాలయాన్ని ధ్వంసం చేస్తారా?

Jul 22 2014 2:02 PM | Updated on Sep 15 2018 8:38 PM

సచివాలయంలో హెచ్-బ్లాక్‌లో గ్రంథాలయం తొలగింపు వివాస్పదంగా మారింది.

హైదరాబాద్: సచివాలయంలో హెచ్-బ్లాక్‌లో గ్రంథాలయం తొలగింపు వివాస్పదంగా మారింది. గ్రంథాలయం తొలగింపుపై తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని ఆరోపించారు.

మరమ్మతుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగంతోపాటు.. బ్లాక్‌లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య చీటికిమాటికి వివాదాలు తలెత్తున్నాయి. సచివాలయాన్ని బారికేడ్లతో రెండుగా విభజించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement