ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ మీదగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందని...
ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ మీదగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందని... ఈ నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంటుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. దాంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. పగటి ఉష్టోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం చిరు జల్లులు పడిన... సాయంత్రం మాత్రం నగరంలో ఓ మోస్తరుగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే.