ఆగని సమైక్య పోరు | Samaikyandhra Movement from 110 days | Sakshi
Sakshi News home page

ఆగని సమైక్య పోరు

Nov 18 2013 1:29 AM | Updated on Nov 9 2018 4:51 PM

ఆగని సమైక్య పోరు - Sakshi

ఆగని సమైక్య పోరు

సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం నాటికి 110రోజులకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో ఆదివారం జడివాన కురుస్తున్నా నిరసనలు కొనసాగాయి.

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం నాటికి 110రోజులకు చేరుకుంది.   చిత్తూరు జిల్లాలో ఆదివారం జడివాన కురుస్తున్నా నిరసనలు కొనసాగాయి. పుంగనూరులోని ఎన్టీఆర్ సర్కిల్‌లో సమైక్యవాదులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.     అనంతపురం జిల్లా తాడిపత్రిలో తైక్వాండో విద్యార్థులు నడిరోడ్డుపై విన్యాసాలు ప్రదర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఫొటోలకు గొర్రెల మాస్క్‌లు ధరించి నిరసన తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.  విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఐదు కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని  చేపట్టారు. కృష్ణాజిల్లా తిరువూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకూ సమైక్యాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభాయ్ తిరువూరు పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement